పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వు అటవీ ప్రాంతంలో జిల్లా పోలీస్ పార్టీలకు మరియు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.ఎదురు కాల్పులకు పాల్పడ్డ మావోయిస్టులు పారిపోవడం జరిగింది. కాల్పుల అనంతరం అట్టి ఈ ప్రదేశంలో తనిఖీలు నిర్వహించగా 01 SBBL తుపాకీ,కిట్ బ్యాగులు,సోలార్ ప్లేట్ మరియు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.